ఎన్టీఆర్ వైద్యసేవలకు ఢోకా లేదు
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:41 AM
ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేయాలని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించలేదు.
తిరుపతి/చిత్తూరు రూరల్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్యసేవలను నిలిపివేయాలని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించలేదు.చిత్తూరులోని మూడు ఆస్పత్రుల్లో ఓపీ సేవల కోసం వచ్చిన వారిని రెండ్రోజుల తరువాత రమ్మని పంపేశారు.తిరుపతి జిల్లావ్యాప్తంగా 38 నెట్వర్క్ ఆస్పత్రులుంటే 4 ఆస్పత్రుల్లో మాత్రమే ఓపీ సేవలు నిలిచాయి.వీటిల్లోనూ అత్యవసర వైద్యసేవలకు ఎక్కడా ఆటంకం జరగలేదని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజశేఖర రెడ్డి తెలిపారు.అత్యవసర శస్త్రచికిత్సల నిర్వహణలో ఆస్పత్రుల యాజమాన్యాలు అశ్రద్ధ చేస్తే చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.