Share News

కాలుష్య కారక వాహనాలకు నో ఎంట్రీ

ABN , Publish Date - May 02 , 2025 | 01:14 AM

కాలుష్యం పెరగడానికి కారణమవుతున్న 25 వాహనాలను తిరుమలకు రాకుండా నిషేధం విధించారు. ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా గురువారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.

కాలుష్య కారక వాహనాలకు నో ఎంట్రీ

తిరుమల, మే 1(ఆంధ్రజ్యోతి): కాలుష్యం పెరగడానికి కారణమవుతున్న 25 వాహనాలను తిరుమలకు రాకుండా నిషేధం విధించారు. ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు సంయుక్తంగా గురువారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.. 25 వాహనాల నుంచి అధికంగా కాలుష్య పొగ విడుదలవుతున్నట్టు గుర్తించారు. వీటికి అనుమతి నిరాకరించారు. కండీషన్‌ సక్రమంగా ఉన్న తర్వాతే అనుమతిస్తామన్నారు. సరైన పత్రాలు, ట్రాక్స్‌, ఫిట్నెస్‌ లేని 19 వాహనాలకు సంబంధించి రూ.2.80 లక్షలు జరిమానా విధించారు. తనిఖీల్లో ఆర్టీవో కార్యాలయ ఎంవీఐలు శ్రీనివాసులు, రమణానాయక్‌, ఆంజనేయప్రసాద్‌, తిరుమల ట్రాఫిక్‌ సీఐ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2025 | 01:14 AM