Share News

భక్తులతో కిటకిటలాడిన ముక్కంటి ఆలయం

ABN , Publish Date - Dec 27 , 2025 | 01:18 AM

ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులతో కిటకిటలాడిన ముక్కంటి ఆలయం
ఆలయం వద్ద భక్తులు

శ్రీకాళహస్తి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ముక్కంటి ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 27వేలమంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్ల ద్వారా 722 మంది, రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్ల ద్వారా 2,627, రూ.50ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా 2,129 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక రూ.500 రాహుకేతు టిక్కెట్ల ద్వారా 1,686మంది, రూ.750 టిక్కెట్ల ద్వారా 805, రూ.1,500 టిక్కెట్ల ద్వారా 248, రూ.2,500 టిక్కెట్ల ద్వారా 245, రూ.5వేలు టిక్కెట్ల ద్వారా 94మంది భక్తులు పూజలు చేయించుకున్నారు. ఇక ఐదు రకాల ప్రసాదాలు కలిపి 20,346 అమ్ముడైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Updated Date - Dec 27 , 2025 | 01:18 AM