కిటకిటలాడిన జపాలి
ABN , Publish Date - Jul 02 , 2025 | 02:08 AM
తిరుమలలోని జపాలి అంజనేయుడి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
తిరుమలలోని జపాలి అంజనేయుడి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కొద్దిరోజులుగా సందర్శనీయ ప్రదేశాల్లో ఒకటైన పాపవినాశన మార్గంలోని జపాలికి భక్తుల తాకిడి పెరిగింది. ఇందులో భాగంగానే మంగళవారం ఆంజనేయస్వామి దర్శనానికి భక్తులు క్యూకట్టారు. సిబ్బంది క్యూలైన్ ద్వారా విడతలవారీగా భక్తులను అనుమతించి దర్శనం కల్పించారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి