ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలి
ABN , Publish Date - May 10 , 2025 | 12:29 AM
జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని డీఐఈవో శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం స్థానిక బీఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్లు, ఫ్లయ్యింగ్, సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందికి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15,377 మంది విద్యార్థుల కోసం 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫస్టియర్లో 10,236 మంది, సెకండియర్లో 3,724 మంది, ఒకేషనల్ ఫస్టియర్లో 810 మంది, సెకండియర్లో 607 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 28 నుంచి జూన్ ఒకటో తేదీవరకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు.

- డీఐఈవో శ్రీనివాసులు
చిత్తూరు సెంట్రల్, మే 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని డీఐఈవో శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం స్థానిక బీఎస్ కన్నన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్లు, ఫ్లయ్యింగ్, సిట్టింగ్ స్క్వాడ్ సిబ్బందికి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15,377 మంది విద్యార్థుల కోసం 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫస్టియర్లో 10,236 మంది, సెకండియర్లో 3,724 మంది, ఒకేషనల్ ఫస్టియర్లో 810 మంది, సెకండియర్లో 607 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి సెంటర్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెల 28 నుంచి జూన్ ఒకటో తేదీవరకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ప్రశ్నపత్రాలను సకాలంలో ఆయా పోలీ్సస్టేషన్ల నుంచి విత్డ్రా చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ద్విచక్రవాహనాల ద్వారా తీసుకురావద్దని హెచ్చరించారు. ప్రతి సీరి్సను సరిచూసుకుని, విద్యార్థులకు సకాలంలో అందించాలని ఆదేశించారు. సరైన కారణాలతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిర్దేశించిన సమయంలోపు పరీక్షలు రాయడానికి అనుమతించాలన్నారు. సమావేశంలో స్పెషల్ అధికారి దయానందరాజు, డీఈసీ మెంబర్లు బాలసుబ్రహ్మణ్యం, శరశ్చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.