వైభవంగా గరుడ వాహనసేవ
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:43 AM
గరుడపంచమి సందర్భంగా మంగళవారం తిరుమలలో గరుడవాహనసేవ వైభవంగా జరిగింది. మలయప్పస్వామి విశేష అలంకరణలో తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల కర్పూర హారతులు, గోవిందనామస్మరణల మధ్య మాడవీధుల్లో విహరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుమల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): గరుడపంచమి సందర్భంగా మంగళవారం తిరుమలలో గరుడవాహనసేవ వైభవంగా జరిగింది. మలయప్పస్వామి విశేష అలంకరణలో తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల కర్పూర హారతులు, గోవిందనామస్మరణల మధ్య మాడవీధుల్లో విహరించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు.