కన్నులపండువగా పౌర్ణమి గరుడసేవ
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:05 AM
తిరుమలలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ కన్నులపండువగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడసేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం మలయప్పస్వామికి విశేష అలంకరణ చేసి గరుడుడిపై వేంచేపు చేశారు. రాత్రి 7 గంటలకు మొదలైన వాహన సేవ.. నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమలలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ కన్నులపండువగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడసేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం మలయప్పస్వామికి విశేష అలంకరణ చేసి గరుడుడిపై వేంచేపు చేశారు. రాత్రి 7 గంటలకు మొదలైన వాహన సేవ.. నాలుగు మాడవీధుల్లో సాగింది. భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి