సిబ్బంది ఫుల్.. సేవలు నిల్!
ABN , Publish Date - May 10 , 2025 | 12:49 AM
కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ సచివాలయానికి పనులనిమిత్తం వెళ్లిన గ్రామస్థులు శుక్రవారం ఉదయం 10.37 గంటలకు తీసిన ఛాయాఛిత్రమిది. పింఛన్ల పంపిణీ, రేషన్ కార్డులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఇంటి పన్నుల వసూళ్లు వంటి అన్నిరకాల పౌర సేవలు ఇప్పుడు సచివాలయాల ద్వారానే ప్రజలకు అందుతున్నాయి. అంటే.. ఆయా సేవలు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిది. కానీ సచివాలయాల ద్వారా సరైన సేవలు తమకు అందడంలేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడి సిబ్బంది కొంతమంది సర్వేలకు వెళ్లిపోతుంటే, మరికొందరు మాతృసంస్థల్లో పనులున్నాయంటూ ఇటువైపు తిరిగి చూడడంలేదు. సెక్రటరీలకు ఆయా పనులతోపాటు తరచూ ఉన్నతాధికారుల సమావేశాలలో పాల్గొనాల్సి ఉండడంతో సచివాలయాలకు వచ్చే సమయం చిక్కడం లేదు.మంకలదొడ్డి సచివాలయంలో సెక్రటరీ భాస్కర్ మంకలదొడ్డితోపాటు పక్కనే ఉన్న జరుగు సచివాలయానికి కూడా ఇన్చార్జి. ఆయన శుక్రవారం కుప్పం మండల సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయ్యారు. మహిళా పోలీసు గత నెల 23 నుంచి రెండు నెలల సెలవులో వెళ్లారు. ఇక మిగిలింది వీఆర్వో, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్. వీరిలో ఒక్కరు కూడా సరైన సమయానికి సచివాలయానికి చేరుకోలేదు. ఉదయం 11 గంటలదాకా మంకలదొడ్డి సచివాలయం ఖాళీగానే ఉంది. అలాగని ప్రభుత్వం అప్పగించిన మనమిత్ర సర్వే, సిటిజన్ సర్వే సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. అక్కడా వెనుకబాటే. ఇటీవల ఒక నెల వేతనం నాలుగైదు రోజులపాటు నిలిపేస్తే ఈ సిబ్బందిలో ఇద్దరు గగ్గోలు పెట్టారు. మాతృ సంస్థల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మరీ వేతనం డ్రా చేసుకుని పంతం నెగ్గించుకున్నారు.

కుప్పం సచివాలయాల్లో ఇదీ పరిస్థితి
కుప్పం, మే 9 (ఆంధ్రజ్యోతి): కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ సచివాలయానికి పనులనిమిత్తం వెళ్లిన గ్రామస్థులు శుక్రవారం ఉదయం 10.37 గంటలకు తీసిన ఛాయాఛిత్రమిది. పింఛన్ల పంపిణీ, రేషన్ కార్డులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఇంటి పన్నుల వసూళ్లు వంటి అన్నిరకాల పౌర సేవలు ఇప్పుడు సచివాలయాల ద్వారానే ప్రజలకు అందుతున్నాయి. అంటే.. ఆయా సేవలు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిది. కానీ సచివాలయాల ద్వారా సరైన సేవలు తమకు అందడంలేదని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడి సిబ్బంది కొంతమంది సర్వేలకు వెళ్లిపోతుంటే, మరికొందరు మాతృసంస్థల్లో పనులున్నాయంటూ ఇటువైపు తిరిగి చూడడంలేదు. సెక్రటరీలకు ఆయా పనులతోపాటు తరచూ ఉన్నతాధికారుల సమావేశాలలో పాల్గొనాల్సి ఉండడంతో సచివాలయాలకు వచ్చే సమయం చిక్కడం లేదు.మంకలదొడ్డి సచివాలయంలో సెక్రటరీ భాస్కర్ మంకలదొడ్డితోపాటు పక్కనే ఉన్న జరుగు సచివాలయానికి కూడా ఇన్చార్జి. ఆయన శుక్రవారం కుప్పం మండల సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయ్యారు. మహిళా పోలీసు గత నెల 23 నుంచి రెండు నెలల సెలవులో వెళ్లారు. ఇక మిగిలింది వీఆర్వో, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్. వీరిలో ఒక్కరు కూడా సరైన సమయానికి సచివాలయానికి చేరుకోలేదు. ఉదయం 11 గంటలదాకా మంకలదొడ్డి సచివాలయం ఖాళీగానే ఉంది. అలాగని ప్రభుత్వం అప్పగించిన మనమిత్ర సర్వే, సిటిజన్ సర్వే సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. అక్కడా వెనుకబాటే. ఇటీవల ఒక నెల వేతనం నాలుగైదు రోజులపాటు నిలిపేస్తే ఈ సిబ్బందిలో ఇద్దరు గగ్గోలు పెట్టారు. మాతృ సంస్థల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మరీ వేతనం డ్రా చేసుకుని పంతం నెగ్గించుకున్నారు. ఈ ఇద్దరు సిబ్బందీ సర్వేలు చేయడానికి ససేమిరా అంటున్నారట. ఇదేమని ప్రశ్నిస్తే తమ మాతృ సంస్థల్లో దిక్కుమాలినన్ని పనులున్నాయి కాబట్టి సర్వేలు చేసేది లేదని తెగేసి చెబుతున్నారట. అలాగని ఆయా డిపార్టుమెంట్ల హెడ్డుల నుంచి లెటర్లు తీసుకురమ్మంటే అది కూడా చేయడం లేదని సమాచారం. కట్ చేస్తే మంకలదొడ్డి పంచాయతీ సచివాలయం శుక్రవారం ఇలా ఖాళీగా కనిపించింది. ఇది ఒక్క మంకలదొడ్డి సచివాలయం, అక్కడి సిబ్బంది పరిస్థితే కాదు.. మొత్తం కుప్పం నియోజకవర్గంలోని అన్ని సచివాలయాలు, సిబ్బంది పరిస్థితి కూడా. ఈ సమస్యకు పరిష్కారం వెదకాల్సిన బాధ్యత కడా పీడీ వికాస్ మర్మత్ మీద ఉంది.