ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ కోసం ‘కియా’, ఐఐటీ వ్యూహాత్మక ఒప్పందం
ABN , Publish Date - May 10 , 2025 | 12:40 AM
ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను ముందుకు తీసుకెళ్లడానికి, సాంకేతిక ఆవిష్కరణలను నడిపించడానికి వ్యూహాత్మక అవగాహన ఒప్పందంపై కార్ల తయారీ సంస్థ అయిన కియా ఇండియా, తిరుపతి ఐఐటీ శుక్రవారం సంతకం చేశాయి. ఇంజనీరింగ్ ఎక్సలెన్సును, పరిశోధన నేతృత్వంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ రంగాల్లో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా ఈ ఎంవోయూ కుదిరింది. తిరుపతి ఐఐటీలో మౌలిక సదుపాయాలు, సహకార పరిశోధన కార్యక్రమాల అభివృద్ధికి కియా ఇండియా ఐదేళ్లకు రూ.35కోట్ల పెట్టుబడిని పెట్టింది. కియా ఇండియాలో వృత్తిపరమైన వృద్ధికి విద్యార్థులకు అర్థవంతమైన అవకాశాలను అందించడం వంటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. అర్హులైన ఎంటెక్ విద్యార్థులకు స్కాలర్షిప్, ఆర్థిక సాయం అందించనున్నట్లు ఐఐటీ అధికారులు తెలిపారు. తిరుపతి ఐఐటీలో మేకర్స్ క్రాస్- డిసిప్లినరీ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లేబోరేటరిని సృష్టించడం ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమన్నారు. ఐఐటీతో చేతులు కలపడం స్థిరమైన పారిశ్రామిక తయారీలో పురోగతికి మంచి అవకాశమని కియా ఇండియా ఎండీ, సీఈవో గ్వాంగు లీ అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థ, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం, ఇంటర్న్షి్పలు, స్కాలర్షి్పల ద్వారా ప్రతిభను వెలికి తీయడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్మంలో వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ గ్రూప్ 2 హెడ్ జాంగ్వాన్ సియో, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్లీ, ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా, డీన్ వెంకటరమణ బదర్లా, డాక్టర్ వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.

ఏర్పేడు, మే 9(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను ముందుకు తీసుకెళ్లడానికి, సాంకేతిక ఆవిష్కరణలను నడిపించడానికి వ్యూహాత్మక అవగాహన ఒప్పందంపై కార్ల తయారీ సంస్థ అయిన కియా ఇండియా, తిరుపతి ఐఐటీ శుక్రవారం సంతకం చేశాయి. ఇంజనీరింగ్ ఎక్సలెన్సును, పరిశోధన నేతృత్వంలోని ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ రంగాల్లో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను పెంపొందించడం లక్ష్యంగా ఈ ఎంవోయూ కుదిరింది. తిరుపతి ఐఐటీలో మౌలిక సదుపాయాలు, సహకార పరిశోధన కార్యక్రమాల అభివృద్ధికి కియా ఇండియా ఐదేళ్లకు రూ.35కోట్ల పెట్టుబడిని పెట్టింది. కియా ఇండియాలో వృత్తిపరమైన వృద్ధికి విద్యార్థులకు అర్థవంతమైన అవకాశాలను అందించడం వంటివి ఉన్నాయని అధికారులు తెలిపారు. అర్హులైన ఎంటెక్ విద్యార్థులకు స్కాలర్షిప్, ఆర్థిక సాయం అందించనున్నట్లు ఐఐటీ అధికారులు తెలిపారు. తిరుపతి ఐఐటీలో మేకర్స్ క్రాస్- డిసిప్లినరీ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లేబోరేటరిని సృష్టించడం ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశమన్నారు. ఐఐటీతో చేతులు కలపడం స్థిరమైన పారిశ్రామిక తయారీలో పురోగతికి మంచి అవకాశమని కియా ఇండియా ఎండీ, సీఈవో గ్వాంగు లీ అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థ, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం, ఇంటర్న్షి్పలు, స్కాలర్షి్పల ద్వారా ప్రతిభను వెలికి తీయడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్మంలో వైస్ ప్రెసిడెంట్, హెచ్ఆర్ అండ్ అడ్మిన్ గ్రూప్ 2 హెడ్ జాంగ్వాన్ సియో, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కబ్డాంగ్లీ, ప్రొఫెసర్ శశిధర్ గుమ్మా, డీన్ వెంకటరమణ బదర్లా, డాక్టర్ వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.