పంచాయతీల వర్గీకరణకు కసరత్తు
ABN , Publish Date - May 10 , 2025 | 12:38 AM
జనాభా, ఆదాయాన్ని బట్టి పంచాయతీల వర్గీకరణకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను నాలుగు విభాగాలు విభజించి.. గ్రేడ్ను బట్టి అర్హులైన వారిని కార్యదర్శులను నియమించాలని జీవోలో పేర్కొంది. ఆ ప్రకారం జిల్లాలోని 774 గ్రామ పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి 16వ తేదిలోపు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ సూచించారు. దీంతో పంచాయతీల వర్గీకరణకు కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం రాత్రి కమిటీని నియ మించి కసరత్తు ప్రారంభించారు. కేటగిరీల వారీగా పంచాయతీలను విభజించి 13వ తేదీ లోపల ప్రతిపాదనలను పంపించాలని డీపీవో సుశీలాదేవిని ఆదేశించారు.

- 16న ప్రభుత్వానికి నివేదిక
తిరుపతి(కలెక్టరేట్), మే 9(ఆంధ్రజ్యోతి): జనాభా, ఆదాయాన్ని బట్టి పంచాయతీల వర్గీకరణకు కసరత్తు మొదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీలను నాలుగు విభాగాలు విభజించి.. గ్రేడ్ను బట్టి అర్హులైన వారిని కార్యదర్శులను నియమించాలని జీవోలో పేర్కొంది. ఆ ప్రకారం జిల్లాలోని 774 గ్రామ పంచాయతీలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి 16వ తేదిలోపు ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ సూచించారు. దీంతో పంచాయతీల వర్గీకరణకు కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం రాత్రి కమిటీని నియ మించి కసరత్తు ప్రారంభించారు. కేటగిరీల వారీగా పంచాయతీలను విభజించి 13వ తేదీ లోపల ప్రతిపాదనలను పంపించాలని డీపీవో సుశీలాదేవిని ఆదేశించారు.
స్పెషల్ గ్రేడ్: వార్షికాదాయం రూ.కోటి మించినా లేదా పది వేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఈ విభాగంలో ఉంటాయి. వీటికి డిప్యూటీ ఎంపీడీవో (ఈవోపీర్డీ) స్థాయి అధికారులను పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తారు. జిల్లాలో స్పెషల్ గ్రేడ్ కింద 14 పంచాయతీలు చేరనున్నాయి.
గ్రేడ్-1: నాలుగు వేల నుంచి 10 వేల జనాభా లేదా వార్షికాదాయం రూ.50లక్షల నుంచి రూ.కోటి ఉన్నా.. లేదా ఆ పంచాయతీకి హెడ్క్వార్టరుగా మండల కేంద్రం ఉంటే గ్రేడ్-1గా పరిగణిస్తారు. దీని పరిధిలో సుమారు 60 పంచాయతీలు రానున్నాయి.
గ్రేడ్-2: ఇందులో 2 వేల నుంచి 4 వేల లోపు జనాభా ఉండే పంచాయతీలు చేరనున్నాయి. ఇలాంటివి 141 పంచాయతీలు ఉన్నాయి.
గ్రేడ్-3: జనాభా రెండు వేలలోపు ఉండే పంచాయతీలన్నీ గ్రేడ్-3 కింద పరిగణిస్తారు. జిల్లాలో 572 పంచాయతీలు దీని కింద రానున్నాయి. స్పెషల్ మ్రినహాయించి మిగతా పంచాయతీలకు నిబంధనల ప్రకారం కార్యదర్శులను నియమించనున్నారు. గిరిజన పంచాయతీలకు షరతులు వర్తించకుండా ప్రామాణికంగా తీసుకోనున్నారు.
జిల్లాకు 15మంది పంచాయతీ కార్యదర్శుల రాక
రాష్ట్రంలో గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి గ్రేడ్-2గా పదోన్నతి కల్పించి వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా రాయలసీమ జిల్లాల్లో పదోన్నతి పొందిన వారిలో 15 మందిని జిల్లాకు కేటాయించారు. వీరిలో.. చిత్తూరు నుంచి లోకముని, కడప నుంచి కె.సుధీర్, సుఽధాకర్, సురే్షకుమార్, సుబ్బరాయుడు, కర్నూలు నుంచి ఎలిజిబెతమ్మ, గిరిధర్, గులాం జమిలాబీ, వెంకట్రాముడు, కోట మునెయ్య, కృష్ణ, అయ్యపురెడ్డి, వెంకటేశ్వర్లు, ఎం.కుమార్, అనంతపురం నుంచి సురే్షబాబు ఉన్నాయి. కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు రెండు మూడురోజుల్లో వీరికి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు డీపీవో సుశీలాదేవి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.