వాతావరణం అనుకూలించక సీఎం పర్యటన రద్దు
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:11 AM
తిరుపతిలో ఆదివారం ప్రారంభమైన మహిళా సాధికారత ప్రారంభ సమావేశానికి హాజరుకావాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం చిరుజల్లులతో పాటు అమరావతి- తిరుపతి మార్గంలో ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయింది.
తిరుపతి, సెప్టెంబరు14(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆదివారం ప్రారంభమైన మహిళా సాధికారత ప్రారంభ సమావేశానికి హాజరుకావాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం చిరుజల్లులతో పాటు అమరావతి- తిరుపతి మార్గంలో ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణం సురక్షితం కాదని ఏవియేషన్ అధికారులు సీఎం ప్రయాణానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.