రూ.68 లక్షల నాన్ జ్యుడీషియల్ స్టాంపుల రాక
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:45 AM
నాన్ జ్యుడీషియల్ స్టాంపులు ఎట్టకేలకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరాయి. వీటిని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): నాన్ జ్యుడీషియల్ స్టాంపులు ఎట్టకేలకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరాయి. వీటిని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తరలిస్తున్నారు. రూ.68లక్షల విలువైన (48వేల రూ.100 స్టాంపులు, 40వేల రూ.50 స్టాంపులు) అందాయి. మూడు నెలలుగా నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత తీవ్రంగా ఉంది. ప్రజలు రిజిస్ట్రేషన్లు, ఒప్పందాలకు ఈ స్టాంపులే వినియోగిస్తుంటారు. ఈ కొరతను అవకాశంగా తీసుకుని స్టాంపు వెండర్లు అధిక ధరలకు అమ్మకాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పంపడంతో ఈ మేరకు స్టాంపులు వచ్చాయి.