గురకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:44 AM
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ విద్యాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ టి.పద్మజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని బాలుర పాఠశాలలో రామకుప్పం, పూతలపట్టు, విజలాపురం పాఠశాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే బాలికలకు చిత్తూరు, పలమనేరు, జీడీ నెల్లూరు, కుప్పం పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయా విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఈనెల 25వ తేది ఉదయం 10 నుంచి 11 గంటల వరకు చిత్తూరులోని బాలికల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
చిత్తూరు అర్బన్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ఆ విద్యాలయాల జిల్లా కో-ఆర్డినేటర్ టి.పద్మజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని బాలుర పాఠశాలలో రామకుప్పం, పూతలపట్టు, విజలాపురం పాఠశాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే బాలికలకు చిత్తూరు, పలమనేరు, జీడీ నెల్లూరు, కుప్పం పాఠశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆయా విద్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఈనెల 25వ తేది ఉదయం 10 నుంచి 11 గంటల వరకు చిత్తూరులోని బాలికల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.