Share News

లాటరీ నిర్వహించని దుకాణాల దరఖాస్తు రుసుం వాపస్‌

ABN , Publish Date - Aug 24 , 2025 | 01:49 AM

ఎక్కడైనా ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకుంటే వాటికి లాటరీ నిర్వహించేది లేదని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నాగమల్లేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి బార్లకు సంబంధించి దరఖాస్తు రుసుంను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు.

లాటరీ నిర్వహించని దుకాణాల దరఖాస్తు రుసుం వాపస్‌

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఎక్కడైనా ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు రాకుంటే వాటికి లాటరీ నిర్వహించేది లేదని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నాగమల్లేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి బార్లకు సంబంధించి దరఖాస్తు రుసుంను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-28 సంవత్సరాలకు సంబంధించి కొత్త బార్‌ పాలసీ ప్రకటించిన తరుణంలో జిల్లా వ్యాప్తంగా 29 బార్లు, గీతకులాల కోసం ప్రత్యేకంగా మరో మూడు బార్లు కేటాయిస్తున్నారన్నారు. ప్రతి దరఖాస్తుకు రూ 5 లక్షలు దరఖాస్తు రుసుం, ప్రాసెసింగ్‌ ఫీజు కింద అదనంగా రూ 10,000 సమర్పించాలన్నారు. ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు అందితేనే లాటరీ తీస్తామన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 01:49 AM