తిరుమలేశుడి సేవలో నటి నిక్కీ
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:27 AM
సినీ నటి నిక్కీ గల్రానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.
సినీ నటి నిక్కీ గల్రానీ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన నిక్కీని చూసేందుకు సినీ అభిమానులు ఉత్సాహం చూపారు. ఫొటోలు తీసుకున్నారు. నిక్కీ ధరించిన ఆభరణాలను పలువురు ఆసక్తిగా చూశారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి