ముక్కంటీశుడికి లక్షార్చన
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:15 AM
: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం వేదోక్తంగా లక్ష బిల్వ, కుంకుమార్చన వేడుకలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అనువంశిక ప్రధాన అర్చకుడు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో సంకల్పం పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో మధ్యాహ్నం వరకు మూడు కాలాల పాటు రుత్వికులు అర్చనలు చేశారు. సాయంత్రం నాల్గో కాలం అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, సభ్యులు, ప్రధాన అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం వేదోక్తంగా లక్ష బిల్వ, కుంకుమార్చన వేడుకలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ అనువంశిక ప్రధాన అర్చకుడు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో సంకల్పం పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో మధ్యాహ్నం వరకు మూడు కాలాల పాటు రుత్వికులు అర్చనలు చేశారు. సాయంత్రం నాల్గో కాలం అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, సభ్యులు, ప్రధాన అర్చకులు, ఆలయాధికారులు పాల్గొన్నారు.