తొలి రోజు 94.39 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Jun 01 , 2025 | 01:01 AM
జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా తొలి రోజైన శనివారం 94.39 శాతం పంపిణీ జరిగింది.
చిత్తూరు సెంట్రల్, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా తొలి రోజైన శనివారం 94.39 శాతం పంపిణీ జరిగింది. 2,62,985 మందికిగాను 2,48,244 మందికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేశారు. వివిధ కారణాలతో పంపిణీ చేయని 14,741 మంది లబ్ధిదారులకు సోమవారం అందజేయనున్నట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు.