Share News

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ABN , Publish Date - Jun 22 , 2025 | 01:46 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచే కాణిపాకానికి జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచే కాణిపాకానికి జిల్లా నలుమూల నుంచి వేల సంఖ్యలో భక్తులు విచ్చేశారు. క్యూలైన్లు నిండిపోయి ఆలయం వెలుపలకు వ్యాపించాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బందితో కలిసి ఈవో పెంచలకిషోర్‌ ఏర్పాట్లను చేశారు.

Updated Date - Jun 22 , 2025 | 01:46 AM