వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - May 12 , 2025 | 01:35 AM
కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రూ.150, రూ.100, ఉచిత దర్శనం క్యూలైన్లు కిక్కిరిశాయి.
ఐరాల(కాణిపాకం), మే 11 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రూ.150, రూ.100, ఉచిత దర్శనం క్యూలైన్లు కిక్కిరిశాయి. స్వామి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. కూలైన్లలో భక్తుల మధ్య ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ఈవో పెంచలకిషోర్ పర్యవేక్షించారు. వేసవి సెలవులు ముగిసే వరకు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశించారు.