Share News

మధ్యాహ్న భోజనం తనిఖీ

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:51 AM

మండలంలోని నడిమి గడ్డపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆర్డీఓ మహేష్‌ మంగళవారం తనిఖీ చేశారు.

మధ్యాహ్న భోజనం తనిఖీ
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ మహేష్‌

ధర్మవరంరూరల్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని నడిమి గడ్డపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆర్డీఓ మహేష్‌ మంగళవారం తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని భోజన ఏజెన్సీ వాళ్లకు సూచించారు. విద్యార్థులకు సకాలం లో భోజనం పెట్టకపోయినా, మెను పాటించకపోయినా తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్నభోజన నాణ్యతను ఉపాఽధ్యా యులు తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jan 29 , 2025 | 12:51 AM