ప్రజలను మోసగించిన చంద్రబాబు
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:00 AM
రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి ఆరోపించారు.

వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి
కర్నూలు న్యూసిటీ, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డి ఆరోపించారు. నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సూర్ సిక్స్ అని ప్రజలను భ్రమల్లోకి తీసుకెళ్లి ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని పథకాలు అమలు చేయలేమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగనమోహనరెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సుమారు రూ.15 వేల కోట్ల మూలధన వ్యయం చేసారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని చేయకుండా కేవలం రూ.13 వేల కోట్లు మూలధన వ్యయం చేశారని తప్పుబట్టారు. సమావేశంలో కార్పొరేటర్లు ఎస్టీ షేక్ అహ్మద్, యూనుస్బాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.