మా నేత తలరాతలు మారిస్తే.. జగన్ తలకాయలు తీస్తాడు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:00 AM
బాధల్లో ఉన్న ప్రజల తలరాతలను మా ర్చేందుకు మా నాయకుడు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, తలకాయలను తీసే పనిలోజగన్ వున్నాడు అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
తిరుపతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ‘బాధల్లో ఉన్న ప్రజల తలరాతలను మా ర్చేందుకు మా నాయకుడు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే, తలకాయలను తీసే పనిలోజగన్ వున్నాడు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తిరుపతిలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన అంతా అరాచకం, కక్షలు, కేసులు, వేధింపులతో సాగితే కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛ, సంతోషాలతో ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. వైసీపీ వస్తే విచారణ లేకుండా లోపలేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అంటున్నారని, అంటే వైసీపీ నేతలు తమ కక్షలు, పగలు తీర్చుకోవడానికి, ప్రజలను వేధించడానికి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని మంత్రి నిమ్మల విమర్శించారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News