Kadapa Public Meeting: 5 లక్షల మందితో నేడు సభ
ABN , Publish Date - May 29 , 2025 | 04:44 AM
మహానాడు చివరి రోజు కడపలో 5లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కడపతోపాటు రాయలసీమ పరిధిలోని నియోజకవర్గాల నుంచి వందల వేల మంది పాల్గొనాలని టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
50 నియోజకవర్గాల నుంచి భారీగా సమీకరణ
ఉమ్మడి కడప జిల్లా తరఫున 2.10 లక్షల మంది!
మహానాడు చివరిరోజు గురువారం కడపలో నిర్వహించే బహిరంగ సభను సీఎం చంద్రబాబు, లోకేశ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 5లక్షల మందితో నభూతో సభ జరిపి.. జగన్ సొంత జిల్లాలో పసుపు సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు మహానాడు వేదిక వద్దే ఈ సభ జరుగుతుంది. కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే 2.10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి 40వేల చొప్పున.. మైదుకూరు-30 వేలు, రాజంపేట, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వేకోడూరు నుంచి 20వేల మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5వేల వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు. బుధవారం మహానాడు ప్రాంగణంలో మంత్రులు అనిత, నారాయణ, రాంప్రసాద్రెడ్డి సభ ఏర్పాట్లపై చర్చించారు.
Also Read:
మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు
బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్
For More Telugu And National News