బనకచర్లపై ఏకపక్ష నిర్ణయం సరికాదు: రామకృష్ణ
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:07 AM
బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులతోపాటు జలవనరుల నిపుణులు, రైతు సంఘ నాయకులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలి..
అమరావతి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘బనకచర్ల ప్రాజెక్టుపై ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఈ ప్రాజెక్టుపై చర్చించడానికి అఖిలపక్ష నాయకులతోపాటు జలవనరుల నిపుణులు, రైతు సంఘ నాయకులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలి’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని పార్టీలతో ఎందుకు చర్చించడం లేదు? అని రామకృష్ణ ప్రశ్నించారు.