Share News

AU Engineering Exam: రేపు ఏయూ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - May 04 , 2025 | 04:51 AM

రేపు (మే 5) విశాఖలో ఏయూ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష (ఆఈట్‌-2025) జరుగుతుంది. 5,948 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు

AU Engineering Exam: రేపు ఏయూ ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష

విశాఖపట్నం, మే 3(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కోర్సుల్లో (సెల్ఫ్‌ సపోర్టు) ప్రవేశాలకు ఏయూ అధికారులు ఈ నెల ఐదో తేదీన ఆఈట్‌-2025ను నిర్వహించనున్నారు. పరీక్షకు మొత్తం 5,948 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరీక్ష జరుగుతుంది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు.

Updated Date - May 04 , 2025 | 04:51 AM