Share News

Ashok Leyland: టీటీడీకి విరాళంగా ఏసీ బస్సు

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:15 AM

టీటీడీకి ఆదివారం ఓ ఏసీ బస్సు విరాళంగా అందింది. సుమారు రూ.35 లక్షల విలువైన 41 సీటర్‌ బస్సును అశోక్‌ లేలాండ్‌ సంస్థ అందజేసింది.

Ashok Leyland: టీటీడీకి విరాళంగా ఏసీ బస్సు

తిరుమల, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): టీటీడీకి ఆదివారం ఓ ఏసీ బస్సు విరాళంగా అందింది. సుమారు రూ.35 లక్షల విలువైన 41 సీటర్‌ బస్సును అశోక్‌ లేలాండ్‌ సంస్థ అందజేసింది. ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తాళాలను అశోక్‌ లేలాండ్‌ ఎంహెచ్‌సీవీ ప్రెసిడెండ్‌ సంజీవ్‌ కుమార్‌ టీటీడీ డిప్యూటీఈవో లోకనాథానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్‌పోర్టు డీఐ వెంకటాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 03:15 AM