BC welfare: పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
ABN , Publish Date - May 14 , 2025 | 05:12 AM
ఏపీ ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మల్లెల ఈశ్వరరావు, పెరిపి ఈశ్వర్, సుగుణమ్మ తదితరులు ఉన్నారు.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): పలు కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మల్లెల ఈశ్వరరావును, కుమ్మరి శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్గా విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పెరిపి ఈశ్వర్ను నియమిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మను, ఏలూరు పట్టణాభివృద్ధి అథారిటీ చైర్పర్సన్గా వాణి వెంకట శివప్రసాద్ పెద్దిబోయినను, తిరుపతి పట్టణాభివృద్ధి అథారిటీ చైర్పర్సన్గా దివాకర్రెడ్డిని నియమిస్తూ మున్సిపల్ శాఖ వేరు వేరు జీవోలను విడుదల చేసింది. వీరు రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 22 నామినేటెడ్ పోస్టులను ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు ఆయా శాఖలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..