Employee Dues: నెలాఖరుకు ఉద్యోగుల బకాయిల చెల్లింపు!
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:22 AM
ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

రూ.5 వేల కోట్ల వరకు చెల్లించే అవకాశం
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జగన్ దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు రూ.25 వేల కోట్లు ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంత చెల్లించింది. ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఈ నెలాఖరుకి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఉపయోగించనున్నట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.