Coastal Length : పెరిగిన ఏపీ తీరం పొడవు
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:41 AM
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పొడవు పెరిగింది. గతంలో 973.70 కిలోమీటర్లుగా ఉన్న తీరం పొడవు 79.37 కి.మీ. (8.154 శాతం) పెరిగి 1053.07 కి.మీ.కు చేరింది. అదే సమయంలో దేశం

తాజా లెక్కలతో 1053.07 కి.మీ.గా తీరం
దేశంలో మొత్తం 11,098.81 కి.మీ. తీర ప్రాంతం
మలుపులు, ఒంపుల లెక్కతో పెరిగిన పొడవు
విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం పొడవు పెరిగింది. గతంలో 973.70 కిలోమీటర్లుగా ఉన్న తీరం పొడవు 79.37 కి.మీ. (8.154 శాతం) పెరిగి 1053.07 కి.మీ.కు చేరింది. అదే సమయంలో దేశం తీరం పొడవు 7,516.60 కి.మీ. నుంచి 11,098.81(48 శాతం) కి.మీ.లకు పెరిగినట్టు తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా కలిసి 1970లో చేసిన సంయుక్త సర్వే ప్రకారం 973.7 కి.మీ. తీర ప్రాంతంగా గుర్తించారు. అయితే నేషనల్ మారిటైమ్ సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ రూపొందించిన విధి విధానాల మేరకు నిర్వహించిన రీ వెరిఫికేషన్లో ఏపీలో తీరం పొడవు 1,053.07 కి.మీ.కు పెరిగినట్టు హోం మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడైంది. ఇటీవల మలుపులు, ఒంపులు కూడా లెక్కించడంతో తీరం పొడవు పెరిగిందని విశాఖలో జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ వీవీఎ్సఎస్ శర్మ చెప్పారు. తాజా వివరాల ప్రకారం.. దేశంలో సముద్ర తీరం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానం(గతంలో రెండో స్థానం)లో నిలిచింది. గతంలో ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్ ఇప్పుడు 2,340.62 కి.మీ.ల పొడవుతో అదే స్థానంలో కొనసాగగా, 1,068.69 కి.మీ.లతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. అలాగే గతంలో దేశంలో తీర ప్రాంతం 7,516.60 కి.మీ.లుగా ప్రకటించారు. నూతన విధివిధానాలను అనుసరించి భారత తీరం పొడవు 3,582.21 కి.మీ. పెరిగి 11,098.81 కి.మీ.లకు చేరిందని వెల్లడైంది.