indoor stadium ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభమయ్యేనా..?
ABN , Publish Date - Mar 11 , 2025 | 11:55 PM
స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో 2014లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి భూమిపూజ చేసి ఆ పనులను ప్రారంభించారు.

కొత్తచెరువు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో 2014లో టీడీపీ ప్రభుత్వం రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాటి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి భూమిపూజ చేసి ఆ పనులను ప్రారంభించారు. ఈ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు పిల్లర్ల వరకు జరిగాయి. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే ఇండోర్ స్టేడియం నిర్మాణానికి నిధులు చేయలేదు. దీంతో ఆ పనులు ఆగిపోయాయి. ఇటీవల జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రజ్యోతి నిర్వహించిన అక్షరమే అండగా - పరిష్కారమే అజెండా కార్యక్రమంలో ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు వెంగన్న ఎమ్మెల్యే పల్లెసింధూరారెడ్డిని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇండోర్స్టేడియం నిర్మాణానికి నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు.