discriminated దళితులపై వివక్ష చూపితే ఉద్యమిస్తాం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:14 AM
దళితుల పట్ల వివక్ష చూపిస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని దళిత ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు.
కళ్యాణదుర్గం, జూన 3(ఆంధ్రజ్యోతి): దళితుల పట్ల వివక్ష చూపిస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని దళిత ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. మండలంలోని బోరంపల్లిలో దళితులకు రేషనషాపును కేటాయిస్తే కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఇలాగే చేస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.