Share News

Tribute క్లబ్‌ మిత్రులకు సన్మానం

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:50 PM

ఇంటింటికి చెత్త సేకరణలో భాగంగా సిద్దరామపురం గ్రామ పంచాయతీ జిల్లాలో మొదటి స్థా నం సాధించింది

Tribute క్లబ్‌ మిత్రులకు సన్మానం
క్లబ్‌ మిత్రులను సన్మానిస్తున్న డీపీఓ

బుక్కపట్నం, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇంటింటికి చెత్త సేకరణలో భాగంగా సిద్దరామపురం గ్రామ పంచాయతీ జిల్లాలో మొదటి స్థా నం సాధించింది. పంచాయతీ రాజ్‌ దినోత్సవం సందర్భంగా ఈ నెల 24న జిల్లా అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి సమత మంగళవారం సిద్దరామపురానికి వెళ్లి .. ఈ ఘనతకు కారణమైన క్లబ్‌ మిత్రులు నరసింహులు, రాములమ్మ, రామాంజినమ్మను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ అశోక్‌కుమార్‌రెడ్డి, సర్పంచ రమణయ్య, కార్యదర్శి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:50 PM