issues ప్రజా సమస్యలపై అదే నిర్లక్ష్యం
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:35 AM
ప్రజా సమస్యల పట్ల అధికారులు అదే నిర్లక్ష్యం చూపుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు డుమ్మా కొట్టారు

యల్లనూరు, జూన 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పట్ల అధికారులు అదే నిర్లక్ష్యం చూపుతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధికారులు డుమ్మా కొట్టారు. తహసీల్దార్ లేకపోవడంతో ఈ సమావేశానికి డిప్యూటి తహసీల్దార్ మునీంద్ర హాజరుకాగా.. మిగిలిన అధికారులు గైర్హాజర్ అయ్యారు. మొత్తం 17 శాఖల అధికారులు హాజరుకావాల్సి ఉండగా.. కేవలం ముగ్గురు అధికారులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో ఇద్దరు సంతకాలు చేసి వెళ్లిపోవడంతో డిప్యూటి తహశీల్దార్ ఒక్కరే ఉండిపోయారు.