కార్తీక పౌర్ణమి వెలుగులు
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:32 AM
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయా ల్లో భక్తులు దీపాలు వెలిగించారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్నెట్వర్క్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు ఆలయా ల్లో భక్తులు దీపాలు వెలిగించారు. కూడేరు జోడులింగాల సంగమేశ్వరస్వామి ఆలయం, పామిడి భోగేశ్వరస్వామి ఆలయం, గుత్తి మండలం కొత్తపేటలో నవ అహోబిల నరసింహస్వామి ఆలయం, బెళుగుప్ప శివాలయంలో జ్వాలాతోరణ ఉత్సవాన్ని నిర్వహించారు. కణేకల్లులో శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.