TDP పాస్టర్లకు అండగా టీడీపీ
ABN , Publish Date - May 22 , 2025 | 12:18 AM
రాష్ట్రంలోని పాస్టర్లు అందరికి టీడీపీ అండగా ఉంటుందని రాష్ట్ర టీడీపీ క్రిస్టియన సెల్ అధ్యక్షుడు స్వామిదాస్ పేర్కొన్నారు.
పుట్టపర్తిటౌన, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాస్టర్లు అందరికి టీడీపీ అండగా ఉంటుందని రాష్ట్ర టీడీపీ క్రిస్టియన సెల్ అధ్యక్షుడు స్వామిదాస్ పేర్కొన్నారు. బుధవారం పుట్టపర్తిలోని గ్రేస్బాబిస్ చ ర్చిలో పలువురు పాస్టర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడా రు. రాష్ట్రలో ఏడు నెలల నుంచి పెండింగ్లో ఉన్నపాస్టర్ల వేతనాల ను ప్రభుత్వం విడుదల చేయడం హర్షనీయమన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న 8,427 మంది పాస్టర్లకు ఏడునెలల గౌరవ వేతనం ఒకేసారి వారి ఖాతాల్లో జమ చేసిందన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే నే క్రైస్తవుల అభివృద్ధి సాధ్యమన్నారు. క్రైస్తవుల సంక్షేమకోసం కూట మి ప్రభుత్వ పలురకాల పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. పాస్టర్లకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమం త్రి పవనకళ్యానకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో క్రిస్టియన సెల్ నాయకులు శ్యాముల్, పుట్టపర్తి ఫాస్టర్ అసోషియేషన అధ్యక్షుడు జోసఫ్, ఫాస్టర్లు డేనియల్, డేవిండ్, జానమార్కు తదితరులు పాల్గొన్నారు.