Take action భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:24 PM
మండలంలోని హరేసముద్రం గ్రామ శివారులోను తాగునీటి ట్యాంకు చుట్టూ ఉన్న భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ తిప్పేస్వామి, మాజీ సర్పంచ పల్లి తిప్పేస్వామి, గ్రామస్థులు డిమాండ్ చేశారు.
బొమ్మనహాళ్, జూన, 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని హరేసముద్రం గ్రామ శివారులోను తాగునీటి ట్యాంకు చుట్టూ ఉన్న భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సర్పంచ తిప్పేస్వామి, మాజీ సర్పంచ పల్లి తిప్పేస్వామి, గ్రామస్థులు డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు తహసీల్దార్ మునివేలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు మాట్లాడారు. ట్యాంక్ సమీపంలోని స్థలాన్ని తిమ్మప్ప అనే వ్యక్తి కబ్జా చేశాడని, అలాగే గ్రామంలో పిర్ల ఆగ్నిగుండం స్థలాన్ని కొందరు అక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అలివేలు శ్రీనివాసులు, గొల్ల రామకృష్ణ, చంద్ర, దివాకర్ ఉన్నారు.