award అవార్డు అందుకున్న విద్యార్థి
ABN , Publish Date - May 07 , 2025 | 11:46 PM
పదో తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అజితకుమార్కు బుధవారం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి బెస్టు స్కోర్ అవార్డును అందజేశారు.

ఓబుళదేవరచెరువు, మే7 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో 570 మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అజితకుమార్కు బుధవారం రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి బెస్టు స్కోర్ అవార్డును అందజేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డు అందుకున్నాడు. భవిష్యతలో మరింత బాగా చదవాలని మంత్రి ఆ విద్యార్థికి సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన రవీంద్రనాథ్రెడ్డి, తదితరులున్నారు.