శివాలయంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:04 AM
మండలంలోని నింబగల్లు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జరుట్ల రాంపురం నుంచి గంగా జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి, స్వామి వారి మూలవిరాట్కు అభిషేకం చేశారు.
ఉరవకొండ, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని నింబగల్లు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జరుట్ల రాంపురం నుంచి గంగా జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి, స్వామి వారి మూలవిరాట్కు అభిషేకం చేశారు. ఏటా ఉత్తరకార్తెలో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆ గ్రామస్థులు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని ఏటా ఇలా పూజలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.