wedding వైభవంగా సీతారాముల కల్యాణం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:51 AM
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న సందర్భంగా ఏటా లాగే ఈసారి కూడా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

ముదిగుబ్బ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న సందర్భంగా ఏటా లాగే ఈసారి కూడా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు బాల రంగాచార్యులు, నరసింహాచార్యులు, లోకరామ్ చార్యులు ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కల్యాణ ప్రాంగణానికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు నామ రాంప్రసాద్ దంపతులు అన్నసంతర్పణ చేశారు.