యూరియా కోసం పడిగాపులు
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:41 PM
మండలంలో ఖరీ్ఫలో పంటలను సాగుచేస్తున్న రైతులు యూరియా కోసం పడిగాపులు తప్ప డం లేదు. శనివారం రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు క్యూలో నిలబడి నిరీక్షించారు.
పామిడి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి) : మండలంలో ఖరీ్ఫలో పంటలను సాగుచేస్తున్న రైతులు యూరియా కోసం పడిగాపులు తప్ప డం లేదు. శనివారం రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు క్యూలో నిలబడి నిరీక్షించారు. పామిడి, మండలంలోని వంకరాజుకాలువ రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే యూరియాను పంపిణీ చేశారు. అదీ ఒక్కొక్క రైతుకు రెండు సంచుల యూరియాను పంపిణీ చేశారు.