Sriharikota ప్రతిభావంత విద్యార్థులకు విజ్ఞాన యాత్ర
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:24 PM
సాంకేతిక రంగాల్లో తమదైన ప్రతిభ కనబరచిన స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులకు సత్యసాయి జిల్లా విద్యాశాఖ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది.
గాండ్లపెంట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : సాంకేతిక రంగాల్లో తమదైన ప్రతిభ కనబరచిన స్థానిక జిల్లా పరిషత ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థినులకు సత్యసాయి జిల్లా విద్యాశాఖ విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేసింది. ఈ యాత్రలో భాగంగా ఆ విద్యార్థులు గురువారం శ్రీహరికోట (అంతరిక్ష పరిశోధన కేంద్రం)ను సందర్శించారు. విద్యార్థులు ఆరీషా, సాధబ్, లిఖిత, యశ్వనీ, శమఫిర్దోష్, మోక్షిత, నీహతబ్సుమ్, గీతిక, పూజిత ఆ పరిశోధన కేంద్రంలో పలు రాకెట్, శాటిలైట్ల నమూనాలను పరిశీలించారు. వీరి వెంట ఉపాధ్యాయులు ఓబులరెడ్డి, రాజారత్నం ఉన్నారు.