RDT ఆర్డీటీపై ఆంక్షలు తొలగించాలి
ABN , Publish Date - May 29 , 2025 | 10:58 PM
ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని మండలంలోని బత్తినవారిపల్లి వాసులు డిమాండ్ చేశారు.
తనకల్లు, మే29 (ఆంధ్రజ్యోతి): ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆక్షలను కేంద్ర ప్రభుత్వం తొలగించాలని మండలంలోని బత్తినవారిపల్లి వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వెనుకబడిన దళిత, గిరిజన, కులాలకు సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ ఎఫ్సీఆర్ఏను కేంద్రం పునరుద్దరించడానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బత్తినవారిపల్లి సీపీఎం నాయకులు శివన్న, గ్రామస్థులు పాల్గొన్నారు.