farmers రైతులకు అండగా జనజాగృతి
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:28 PM
మండలంలోని పెద్దపల్లి గ్రామంలోని రైతులకు జనజాగృతి అండగా నిలిచింది.

తనకల్లు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దపల్లి గ్రామంలోని రైతులకు జనజాగృతి అండగా నిలిచింది. ఈ గ్రామంలోని పలుబోర్లు ఎండిపోయాయి. దీంతో ఆయా బోర్ల కింద సాగు చేస్తున్న వేరుశనగ, మిరప, శనగ తదితర పంటలు ఎండు ముఖం పట్టాయి. ఆ సమయంలో జనజాగృతి సంస్థ రైతులకు స్పింక్లర్లను మంజూరు చేసింది. రైతులకు నీటి సాయంపై అవగాహన కల్పించింది. దీంతో పక్కనున్న రైతుల బోర్ల నుంచి నీటిని స్పింక్లర్ల ద్వారా సరఫరా చేసేలా ఒప్పించి.. ఆ పంటలను కాపాడారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా నీటిని పంచుకునే రైతులకు ఉచితంగా స్పింక్లర్ల సెట్టు, నీటి పైపులను మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.