Share News

harassment. వేధింపుల నుంచి కాపాడండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:40 AM

కులసంఘాలు, రాజకీయ నాయకుల వేధింపుల నుంచి సచివాలయ, పంచాయతీ ఉద్యోగులను కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌కు సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అదించారు.

 harassment. వేధింపుల నుంచి కాపాడండి
వినతి పత్రం ఇస్తున్న ఉద్యోగులు

పుట్టపర్తిటౌన, మార్చి 10(ఆంధ్రజ్యోతి): కులసంఘాలు, రాజకీయ నాయకుల వేధింపుల నుంచి సచివాలయ, పంచాయతీ ఉద్యోగులను కాపాడాలని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌కు సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం అదించారు. కలెక్టర్‌ కార్యాలయంలో పంచాయతీ సంఘం నాయకులు పభ్రాకర్‌, ఓంప్రసాద్‌, నరేష్‌, సురేంద్రరెడ్డి తదితరులు మాట్లాడారు. ఇటీవల పుట్టపర్తి మండలంలోని పెడబల్లి పంచాయతీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, సిబ్బందిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని వాపోయారు. నిబంధనల మేరకు వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై కులసంఘాల నాయకుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయన్నారు. అక్రమ కేసుల నుంచి సచివాలయ ఉద్యోగులను కాపాడాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తే ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులను వేధించే వారిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 11 , 2025 | 01:40 AM