ఈ రోడ్డును బాగు చేయరూ..!
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:25 AM
మండల కేంద్రం నుంచి సంగమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. చిన్నపాటి వాన పడినా బురదమయంగా మారుతోంది.
కూడేరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి సంగమేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. చిన్నపాటి వాన పడినా బురదమయంగా మారుతోంది. తప్పనిపరిస్థితుల్లో ఈ రోడ్డుపైనే వందలాది మంది నడిచివెళ్తుంటారు. వారిలో అనేక మం ది జారి పడి గాయపడుతున్నారు. అధికారులు స్పందించి ఈ రోడ్డు ను బాగుచేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.