Nettikanti Swamy నెట్టికంటికి రూ.2.25 కోట్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:56 AM
కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి గర్భాలయం, విమాన గోపురం, ముఖమండపం రాతితో నిర్మించేందుకు దాతలు ముందుకొచ్చారు.
రాతి ముఖమండపం నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు
గుంతకల్లు టౌన, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి గర్భాలయం, విమాన గోపురం, ముఖమండపం రాతితో నిర్మించేందుకు దాతలు ముందుకొచ్చారు. కర్ణాటకలోని రా యచూరు పట్టణానికి చెందిన నవోదయ విద్యాసంస్థల అధినేత, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి కసాపురం ఆ లయంలో గర్భాలయం, విమాన గోపురం, ముఖమండపాన్ని రాతితో నిర్మించేందుకు రూ.2.25 కోట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని ఆ లయ ఈఓ విజయరాజుకు శుక్రవారం రాయచూరులో అందజేశారు. అనంత రం ఆయనకు వేదపండితులు, అర్చకులు.. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాల ను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్యులు, వేదపండితులు సాయికుమార్శర్మ, ఏఈఓ వెంకటేశ్వరుడు పాల్గొన్నారు.