Share News

22 నుంచి నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:00 AM

స్థానిక యల్లనూరురోడ్డులోని వాటర్‌ట్యాంక్‌ వద్ద ఉన్న శ్రీ విజయచౌడేశ్వరిదేవి ఆలయంలో ఈనెల 22నుంచి అక్టోబరు 2వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి కన్వీనర్‌ పోతుల గంగాధర్‌యాదవ్‌ తెలిపారు.

22 నుంచి నవరాత్రి ఉత్సవాలు
పందిరికర్ర పూజలో ఉత్సవ సమితి సభ్యులు

తాడిపత్రి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక యల్లనూరురోడ్డులోని వాటర్‌ట్యాంక్‌ వద్ద ఉన్న శ్రీ విజయచౌడేశ్వరిదేవి ఆలయంలో ఈనెల 22నుంచి అక్టోబరు 2వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి కన్వీనర్‌ పోతుల గంగాధర్‌యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గామాత మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పందిరికర్ర పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు శివారెడ్డి, నారాయణస్వామి, వేణుగోపాల్‌, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:00 AM