Share News

strike notice మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు

ABN , Publish Date - May 07 , 2025 | 11:38 PM

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు మున్సిపల్‌ కార్మికులు కమిషనర్‌ కిరణ్‌కుమార్‌కు బుధవారం నోటీసు అందించారు.

 strike notice మున్సిపల్‌ కార్మికుల సమ్మె నోటీసు
కమిషనర్‌కు సమ్మె నోటీసు అందచేస్తున్న కార్మికులు

కదిరిఅర్బన, మే 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు మున్సిపల్‌ కార్మికులు కమిషనర్‌ కిరణ్‌కుమార్‌కు బుధవారం నోటీసు అందించారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని.. తదితర డిమాండ్లతో సమ్మె చేస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో యూనియన నాయకులు లక్ష్మీనారాయణ, తిరుపాల్‌, జనార్ధన, బాలక్రిష్ణ, చెన్నక్రిష్ణ, గంగప్ప, సీఐటియు జగన్మోహన, రామోహన,ముస్కాక్‌, అలీ పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:38 PM