Share News

Mock drill అప్రమత్తతపై మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - May 07 , 2025 | 11:36 PM

పాక్‌పై ప్రతీకారచర్యగా భారత సింధూరం పేరుతో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన దాడులు విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగితే ఎలా అప్రమత్తం కావాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

Mock drill  అప్రమత్తతపై మాక్‌ డ్రిల్‌
బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తున్న వైద్యులు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌ : పాక్‌పై ప్రతీకారచర్యగా భారత సింధూరం పేరుతో బుధవారం తెల్లవారుజామున చేపట్టిన దాడులు విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడులు జరిగితే ఎలా అప్రమత్తం కావాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఫైర్‌ సిబ్బంది, మెడికల్‌ ఆఫీసర్లు, సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, జీఆర్‌పీఎఫ్‌, పోలీసులు ఈ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ధర్మవరం రైల్వే స్టేషన, కదిరి రైల్వేస్టేషన, ముదిగుబ్బ రైల్వే స్టేషన, తాడిమర్రి సబ్‌స్టేషన, బస్టాండ్‌ కూడలిలో, ఓబుళదేవరచెరువులోని వైఎ్‌సఆర్‌ సర్కిల్‌లో ఈ మాక్‌ డ్రిల్‌ చేపట్టారు. దాడుల్లో గాయపడ్డ వారికి ఎలా ప్రథమ చికిత్స చేయాలనే దానిపై బత్తలపల్లిలో ఆర్డీటీ ఆస్పత్రిలో అవగాహన కల్పించారు.

Updated Date - May 07 , 2025 | 11:36 PM