ఉంతకల్లులో వైద్య శిబిరం ఏర్పాటు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:09 AM
మండలంలోని ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో పలువురు చిన్నారులు జ్వరాల బారిన పడ్డారు. దీనిపై ఆంధ్రజ్యోతి బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో పలువురు చిన్నారులు జ్వరాల బారిన పడ్డారు. దీనిపై ఆంధ్రజ్యోతి బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో బొమ్మనహాళ్ ప్రాథమిక ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జ్వరంతో బాధపడుతున్న చిన్నారుల రక్త నమూనాలను సేకరించారు. మాత్రలను పంపిణీ చేశారు.